రచన : sahachara | బ్లాగు : సహచర (SAHACHARA)
జనం బాధలను ఈ ప్రపంచానికి అర్థమయేలా చిత్రీకరించాలని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండి గ్రామానికి చెందిన సహచర సభ్యుడు నాగరాజు భావించాడు. ఆర్థిక పరిస్థితులుసహకరించక పోయినా కష్టనష్టాలకోర్చి లక్ష రూపాయలతో కొత్త కెమెరా కొన్నాడు. అదే సమయంలో అయన ఇంటికి వెళ్లాను నేను. నాగరాజు ఎంతో ఆత్మీయతతో తన కొత్త కెమెరాతో మొట్టమొదటగా తీసిన ఫోటో ఇది.
నాగరాజూ, మొదట నా ఫోటోనే ఎందుకు తీశావని అడిగాను నేను.
మనంకాక ఈ వ్యవస్థను మరెవ్వరు మరమ్మతు చేయగలరనే ఆలోచన రేకెత్తించినందుకని... చెప్పాడు నాగరాజు.
ఆ మాటలు నాలో చాలా ఆనందాన్ని నింపాయి.
పూర్తిటపా చదవండి...


View the Original article