రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
మున్ను కాదులెండి ఈమధ్యనే నారదులవారు ఇలాతలానికి వేంచేసి, భూనభోంతరాళాల చుట్టుతిరిగి, ఈనాటి నవచైతన్యానికి, నవనవోన్మేషమై పరిఢవిల్లుతున్న నవజీవనవిధానానికీ అచ్చెరువొంది, హడావుడిగా వైకుంఠం చేరుకున్నారు శ్రీమహా విష్ణువునితో సంప్రదించడానికి. “మహా ప్రభో, ఆంధ్రదేశము నాకు మిక్కిలి అయోమయముగా నున్నది. వీరు అంతర్జాలమునందు వేళా పాళా లేక విహరించుచు, పరస్పర భూషణలతో కాలము గడుపుచున్నారు. మున్ను సత్యనారాయణవ్రతము చెప్పి తమరు జనులను తరింపజేసిరి. ఈనాటిజనులకు అట్టి వ్రతము ఏదైనను గలదా?” అని కరద్వయము ముకుళించి ప్రశ్నించెను దీనాతిదీనముగా. అంతట శ్రీమహా […]పూర్తిటపా చదవండి...

View the Original article