రచన : Vinuthna | బ్లాగు : Kandireega.com

తెలంగాణ బీజేపీ నేతలకు సభ్యత్వ నమోదు ఫీవర్ పట్టుకుంది. గత నెలలో హైదరాబాద్ లో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మెంబర్షిప్ విషయంలో ఇక్కడి నేతలపై మందలింపు ధోరణితో వ్యవహరించారు. ‘ఇంతేనా..మీ సభ్యత్వాలు’ అంటూ మండిపడ్డారు. భారీ టార్గెట్ ఫిక్స్ చేసి ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా అంత సీరియస్ అయినా టీబీజేపీ నేతలు లైట్ తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అమిత్ షా వచ్చి వెళ్ళి నెల రోజులైనా సభ్యత్వ నమోదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుందట. దీంతో కిషన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి సభ్యత్వ నమోదు గురించి అమిత్ షా అరా తీసారని తెలుస్తోంది. మరో సారి క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది.

Related Videos పూర్తిటపా చదవండి...



View the Original article